బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై దాడిని బీజేపీ నేత హుజురాబాద్ భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల్లో పలుకుబడిని కోల్పోయి అసహనానికి గురై ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఈటెల రాజేందర్ విమర్శించారు. అసహనం కారణంగానే బీజేపీపార్టీ నాయకుల పై టీఆర్ఎస్ నేతలు దాడికి దిగుతున్నారని ఈటెల రాజేందర్ విమర్శించారు.


ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న ఈటెల రాజేందర్.. పోలీసుల అనుమతితో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్రను తెరాస నాయకుల ముసుగులో ఉన్న గుండాలు దాడికి దిగారని గుర్తు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని తెరాస నాయకులు దాడికి దిగుతున్నారని.. పోలీసులు కూడా తమ వైఖరిని మార్చుకోవాలని ఈటెల రాజేందర్ అన్నారు. తెరాస నాయకులు ఇదే తరహాలో ప్రవర్తిస్తే భవిష్యత్తులో తమ ఆగ్రహానికి గురికాక తప్పందని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ లిబర్టీ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఈటెల.. దాడి విషయంపై స్పందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: