ఇన్నేళ్లూ  గిరిజన రిజర్వేషన్లు అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేశారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బండి సంజయ్ ఏమంటున్నారంటే..
” కేసీఆర్.. పోడు భూములకు పట్టాలివ్వకుండా నిన్ను అడ్డుకున్నదెవరు?.. కేంద్రమే అడ్డుకుందని ఎందుకు మోసం చేసినవ్.. దొంగ జీవోలిచ్చి చేతులు దులుపుకుంటే వదిలే ప్రసక్తే లేదు.. తక్షణమే 1‌0 శాతం గిరిజన రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలివ్వాల్సిందే.. గిరిజన సమస్యలపై తెగించి కొట్లాడి జైలు పాలైంది బీజేపీ నేతలే.. మీరు కొట్టినా తిట్టినా పడతం... మాక్కావాల్సింది ప్రజా సమస్యలు పరిష్కారమే.. రజాకార్ల చేతిలో 4500 మంది బలైతే... నిజాం పేరెత్తని కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే.. బీజేపీకి వస్తున్న స్పందనను చూసి  కేసీఆర్ గజగజ వణికిపోతున్నారు.. కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు, ఎంఐఎంలు ఒక్కటైనా ఏం చేయలేరు.. ఆ పార్టీలకు ఓట్లేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లే..తెలంగాణలో జరుగుతున్న అభివ్రుద్దికి కేంద్రం నిధులిస్తుంటే జేబులేసుకుంటున్నరు”అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: