ఏపీఎస్ఆర్టీసీలో కొత్త బస్సులు రాబోతున్నాయి. అద్దె బస్సులు క్రమంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ నాటికి కొత్తగా వెయ్యి అద్దె బస్సులు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. వీటిని దశల వారీగా రోడ్డెక్కించే చర్యలు తీసుకుంటోంది. తాజాగా మరో  263 అద్దెబస్సులు ప్రవేశపెట్టేందుకు సంస్థ చర్యలు తీసుకుంది. జిల్లాల వారీగా కావాల్సిన అద్దె బస్సులకు టెండర్ల కోసం ప్రకటన జారీ చేసింది.

వీటిలో 4 స్లీపర్, 6 నాన్ ఎసీ స్లీపర్, 12 సూపర్ లగ్జరీ,15 ఆల్ట్రాడీలక్స్ బస్సులు ఉన్నాయి.  30 ఎక్స్ ప్రెస్, 95 అల్ట్రా పల్లె వెలుగు,72 పల్లెవెలుగు బస్సులు, 27మెట్రో ఎక్స్ ప్రెస్, 2 సిటీఆర్డినరీ బస్సులు కూడా కొత్తగా అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ నడిపించనుంది. అద్దె బస్సులు నడిపేందుకు ఆసక్తి కలవారు ఎంఎస్టీసీ  ఈ కామర్స్ పోర్టల్ లో టెండర్లు దాఖలు చేయవచ్చని ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 23 ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 10 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: