అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయట. ఈ మేరకు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు ఆచంట సునీత ఈ విషయంపై ఆందోళన చేస్తున్నారు. అంగన్వాడీ సూపర్ వైజర్ ఉద్యోగాల్లో పారదర్శకత లోపించిందంటూ టీడీపీ అంగన్వాడీ విభాగం ప్రతినిధులు గుంటూరులోని రాష్ట్ర ఐసీడీఎస్ కార్యాలయానికి వచ్చి మెమెరాండం సమర్పించారు.

అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా అధికార పక్షానికి చెందిన అభ్యర్థులకే ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సునీత ఆరోపించారు. ఒక్కో పోస్టు 12 లక్షల వరకు పలుకుతుందని.. ప్రక్రియ లో ఎక్కడా పారదర్శకత లేదని ఆరోపించారు. పరీక్ష జరిగాక కీ ఇవ్వకుండా, ఫలితాలు విడుదల చేయకుండానే పోస్టులు అమ్మకానికి పెట్టారని... దీనిపై ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు చేయాలని సునీత డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: