చంద్రబాబుకు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రిమాండ్‌ విధించే రోజు ఏసీబీ కోర్టులో హైడ్రామా జరిగింది. తీర్పు ప్రకటించే ముందు న్యాయమూర్తి కోర్టులో 30 మందినే ఉండాలని కోరారు. ఆ తర్వాత తీర్పు ప్రకటించారు. అయితే ఇప్పుడు టీడీపీ అనుకూలురు చివరకు మహిళా న్యాయమూర్తిని కూడా తప్పుబడుతున్నారు. ఆమెపై కూడా విమర్శలు చేస్తున్నారు.

తాజాగా మాజీ మెజిస్ట్రేట్ రామకృష్ణ ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. ఆరోజు మెజిస్ట్రేట్‌ కోర్టులో తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ల్యాండ్ లైన్‌ మోగిందని.. ఆ తర్వాతే తీర్పు వచ్చిందని..అందుకే మెజిస్ట్రేట్ ల్యాండ్ లైన్ కాల్‌ డేటా అంతా బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. చివరకు మేజిస్ట్రేట్‌లపై కూడా దారుణమైన విమర్శలు చేస్తున్నారు. గతంలో అమరావతి కేసుల విషయంలోనూ ఇలాగే జడ్జిలపై విమర్శలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: