కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ సీఎం కేసీఆర్‌ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చారని నిర్మలా సీతారామన్‌ అన్నారు. పెట్టుబడులకు అనుకూలంగా రాజధానిగా ఉన్న రాష్ట్రాన్ని లోటు బడ్జెట్‌లోకి కేసీఆర్‌ నెట్టారని నిర్మలా సీతారామన్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని.. కేసీఆర్ కు ప్రజలు కాకుండా కేవలం కుటుంబం గురించే ఆలోచన ఉందని నిర్మలా సీతారామన్‌ విమర్శించారు.


బంగారంలాంటి రాష్ట్రాన్ని అధ్వాన్నంగా తయారు చేశారన్న నిర్మలా సీతారామన్‌.. రాష్ట్రంలో ఆరు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీసుకువచ్చిన మతపరమైన రిజర్వేషన్‌లను తొలగిస్తామని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారని.. రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేసి ఆరు  నెలల్లోనే ఆ పదవి నుంచి తొలగించారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత అధ్వాన్నంగా ఉందన్న నిర్మలా సీతారామన్‌ ఫిల్లర్లు కుంగిపోవడమంటే మామూలు విషయం కాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: