జగన్ ఐపీఎల్ టీమ్ అంటూ పెడితే, దాని పేరు కోడికత్తి వారియర్స్ ఉంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విజయనగరం జిల్లాలో తన పాదయాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికలు జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య సాగే యుద్ధమన్న నారా లోకేష్.. నవశకం బొమ్మ బ్లాక్ బాస్టర్ అన్నారు. ఒకే వేదికపై ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలయ్యలను చూస్తే తాడేపల్లి ప్యాలెస్ టీవీలు పగులుతాయని నారా లోకేష్ అన్నారు.


తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు యువగళం ఆగదన్న నారా లోకేష్.. ఉత్తరాంధ్ర అండ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర కొండంత అండ, రాయలసీమ రత్నాల సీమ అని డైలాగ్‌ చెప్పారు. నాకు ఎన్టీఆర్ ప్రసాదించిన గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టడు కూడా అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు. జగన్ ది రాజారెడ్డి పొగరైతే, లోకేష్ ది అంబేద్కర్ రాజ్యాంగ పౌరుషమని.. చంద్రబాబు విజనరీ, జగన్ ప్రిజనరీ అంటూ నారా లోకేష్ రైమింగ్‌తో డైలాగులు చెప్పారు. ప్రజా జీవితాలతో ఇప్పటికే ఆటలాడుకున్న జగన్, ఆడుదాo ఆంధ్రా అంటున్నాడన్న నారా లోకేష్.. పాదయాత్ర తో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: