తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేసింది. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అవకాశం కల్పించింది. మెదక్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌ పోటీ చేయనున్నారు. ఇక ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణకు, భువనగిరి నుంచి సీఎం రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలకు కాంగ్రెస్ హైకమాండ్  అవకాశం కల్పించింది.

ఈ నాలుగు సీట్ల ప్రకటనతో  తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలు మినహా మిగతా వాటికి అభ్యర్థుల ఖరారు పూర్తయింది. అభ్యర్థుల ఎంపికపై నిన్న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలో చర్చించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, గోవా అభ్యర్థుల గురించి కూడా చర్చించారు. ఈ చర్చల్లో  సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్‌, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. గోవా మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లోని 14 స్థానాలకు అభ్యర్థుల పేర్లను పార్టీ విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: