భారతదేశంలో అత్యధిక వినియోగదారుల దృష్టి కేంద్రీకరించిన బ్రాండ్ల జాబితాలో శామ్ సంగ్ మొబైల్ ఫోన్లు అగ్రస్థానంలో ఉన్నాయని బ్రాండ్ అనలిటిక్స్ సంస్థ టిఆర్ఎ రీసెర్చ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ల్యాప్టాప్ తయారీ దారు డెల్, ఆపిల్ యొక్క ఐఫోన్ మరియు ఎల్జి (టెలివిజన్లు) నివేదికలో వరుసగా రెండవ, మూడవ మరియు నాల్గవ ర్యాంకులను సాధించాయి. వినియోగదారుల దృష్టి కేంద్రీకరించిన టాప్ 100 బ్రాండ్లలో 56 భారతీయ కంపెనీలు వున్నాయి. వీటిలో ఎల్ఐసి, టాటా మోటార్స్ మరియు అముల్ (మిల్క్) ఉన్నాయి.
ఈ జాబితాలో టాటా గ్రూప్ నుండి 18 బ్రాండ్లు, గోద్రేజ్ గ్రూప్ నుండి 11 బ్రాండ్లు ఉన్నాయి. అత్యధిక వినియోగదారుల దృష్టి కేంద్రీకరించిన జాబితాలో భారతీయ బ్రాండ్లు వచ్చాయని ఇది ఒక సూచన అని టిఆర్ఎ రీసెర్చ్ సిఇఒ ఎన్. చంద్రమౌలి మోస్ట్ కన్స్యూమర్-ఫోకస్డ్ బ్రాండ్స్ రిపోర్ట్ 2019 ను ఆవిష్కరిస్తూ చెప్పారు. శామ్ సంగ్ విషయానికొస్తే, వినియోగదారుల సలహాలను, సూచనలను , సమస్యలను శామ్ సంగ్ స్వీకరిస్తుంది . వినియోగదారు-కేంద్రీకృత ఆవిష్కరణలపై దృష్టి కేంద్రీకరించిన మొబైల్ ఫోన్ కేటగిరీలోని శామ్సంగ్ సాంకేతిక పరిమితులను నెట్టివేసింది మరియు మార్కెట్ లో తమ బ్రాండ్ కు ఒక పేరు ఏర్పరచుకుంది, తద్వారా నాణ్యమైన హార్డ్ వైర్ , సాఫ్ట్ వైర్ వినియోగదారు బ్రాండ్లను సృష్టిస్తుంది అని ఆయన అన్నారు.
పాండ్స్ , హోండా వరుసగా ఐదవ, ఆరవ ర్యాంకులలో మొదటి 20 స్థానాల జాబితాలో ప్రవేశించాయి. ఎల్ఐసి ఒక ర్యాంకును కోల్పోయి ఏడవ స్థానాన్ని ఆక్రమించింది, తరువాత సోనీ టెలివిజన్లు ఉన్నాయి. టాటా మోటార్స్ , అముల్ వరుసగా తొమ్మిదవ , పదవ స్థానాలను పొందాయి. ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్లో అవివా లైఫ్ ఇన్సూరెన్స్ 32 వ స్థానం, ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్లో డిటిడిసి 313 వ స్థానం , డియో / పెర్ఫ్యూమ్లో ఫాగ్ 31 వ స్థానం, ప్రీ-స్కూల్లో కంగారూ కిడ్స్ 31 వ స్థానం, ఒట్టో 61 వ స్థానం మెన్స్వేర్ రంగం లో , ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ 197 వ స్థానం హోటళ్లలో, తనీష్క్ 29 వ స్థానం జ్యువెలరీ రంగం లో సాధించాయి.