దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తుంది. అయితే ఈ మహమ్మారి కారణంగా చాల మంది చనిపోయారు. ఇంకా కొన్ని లక్షల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే రోజుకు ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య పెడుతుండడంతో ప్రజలు ఇంట్లో నుండి బయటకి రావడానికే భయపడుతున్నారు. అయితే ఈఎస్ఐ స్కీమ్‌ లో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ని ప్రకటించింది. అయితే ఇందులో మెటర్నిటీ ఖర్చులను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


అయితే స్కీమ్ ‌లో చేరిన వ్యక్తి భార్యలకు ప్రసూతి ఖర్చుల కింద రూ.7,500 అందజేస్తారని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం వీరికి రూ.5,000 అందజేస్తామని తెలిపారు. అయితే దీనిపై కార్మిక మంత్రిత్వ శాఖ మెటర్నిటీ ఖర్చులను పెంచే నిర్ణయానికి సంబంధించి ఒక ముసాయిదాను విడుదల చేసిందని వారు వెల్లడించారు.


అయితే దీనికి సంబంధిచి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం మెటర్నిటీ వ్యయాల పెంపునకు సంబంధించి ప్రజలు వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలిజేయవచ్చు. 30 రోజుల్లోగా సూచనలు, సలహాలు తెలియజేయాలి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐ స్కీమ్‌ ను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్‌ రూల్స్ 1950 లోని రూల్ 56 ఏను సవరిస్తోందని అధికారులు వెల్లడించారు. అయితే ఈఎస్ఐ హాస్పిటల్‌ లో వైద్యం చేయించుకోని మహిళలకు మాత్రమే ఈ రూ.7,500 అందజేస్తారని ఈ సందర్బంగా పేర్కొన్నారు.


అంతేకాక ఈఎస్ఐ స్కీమ్‌ లో రూ.21,000 లోపు వేతనం ఉన్న వారు చేరవచ్చునని అధికారులు తెలియజేశారు. అయితే వీరికి పలు రకాల ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. అయితే ఉద్యోగం పోయినప్పుడు డబ్బులు పొందటం, సహా ఈఎస్ఐ హాస్పిటల్స్ ‌లో ఉచిత వైద్యం వంటి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా మహిళలకు మెటర్నిటీ ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తారని అధికారాలు ఈ సందర్బంగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: