దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధి కోల్పోయారు. అంతేకాక దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోయింది. ఇప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ఇంటి నుండి బయటకి రావడానికే బయపడిపోతున్నారు. కరోనా రావడానికి ముందు ఎవరైనా టూవీలర్, కానీ ఫోర్ వీలర్ వాహనాలను ఏమైనా కొన్నారా.. అంతేకాదు టూవీలర్, కానీ ఫోర్ వీలర్ వాహనాలు కలిగి ఉన్నారా అయితే ఈ వార్త మీ కోసమే.


మీకు బైక్ ఉందా? లేదంటే స్కూటర్ కలిగి ఉన్నారా? ఇవి రెండూ కాకుండా ఏకంగా కారు ఉందా? అయితే ఇది మీకు శుభవార్త అనే చెప్పాలి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ఊరట కలిగించే ప్రకటన జారీ చేసింది. వెహికల్ డాక్యుమెంట్ల వాలిడిటీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ తాజాగా మోటార్ వెహికల్ డాక్యుమెంట్లు అయిన వెహకల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సహా ఇతర వెహికల్ డాక్యుమెంట్ల వాలిడిటీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని నిపుణులు వెల్లడించారు.


అంతేకాదు కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం అని నిపుణులు అంటున్నారు. ఇక మోదీ సర్కార్ తాజా నిర్ణయంతో వాహనదారులకు చాలా ప్రయోజనం కలుగనుందని తెలియజేశారు. తాజా నిర్ణయంతో ప్రజలకు డాక్యుమెంట్ల రెన్యూవల్‌కు ఎక్కువ గడువు అందుబాటులోకి వస్తుందన్నారు. సింపుల్‌గా చెప్పాలంటే వెహికల్ డాక్యుమెంట్లు ఏమైనా ఎక్స్‌పైరీ అయ్యి ఉంటే.. ఇప్పుడు ఇవి డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతాయని అన్నారు. ఈ ఏడాది లోపు ఎక్స్‌పైరీ అయిన డాక్యుమెంట్లను రెన్యూవల్ చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎక్స్‌పైరీ అయ్యి ఉంటే దాన్ని కూడా డిసెంబర్ లోపు రెన్యూవల్ చేసుకోవచ్చునని నిపుణులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: