ప్రేమ గుడ్డిది అని చెబుతూ ఉంటారు.. ఇక ప్రేమలో మునిగి తేలుతున్న వారు ఈ లోకాన్ని మైమరచిపోతూ ఉంటారు అని అంటూ ఉంటారు. అయితే కొంతమంది ని చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్ధమైన వారు చివరికి అదేప్రేమలో మోసపోయి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు నేటి రోజుల్లో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ప్రేమ ఒకప్పటిలా కాదు నేటి రోజుల్లో ప్రేమ అనేది  ప్రతి ఒక్కరికి కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది.  కేవలం అవసరాల కోసం మాత్రమే ప్రేమించడం.. అవసరాలు తీరిన తర్వాత  కాస్త జాలి దయ చూపకుండా నిర్లక్ష్యంగా నడిరోడ్డు మీద వదిలివేయడం లాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం.. ఏకంగా ప్రేమను గెలిపించుకోవడానికి అబ్బాయి అమ్మాయిగా మారడం.. అమ్మాయి అబ్బాయి గా మారడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటివి కేవలం సినిమాల్లోనే కాదు ఇటీవలికాలంలో నిజజీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  ప్రేమ కోసం ఒక అబ్బాయి అమ్మాయిగా మారిన ఘటన వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. ప్రేమ కోసం ఏకంగా ఒక మహిళ పురుషుడి గా మారిపోయింది.



 కానీ చివరికి మరో మహిళ చేతిలో నిండా మోసపోయింది. ఈ ఘటన తమిళనాడులోని మదురై విల్లా పురం లో వెలుగులోకి వచ్చింది. జయసుధ, సెంతిలా అనే ఇద్దరు యువతులు స్నేహితులు. ఈ మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది.  పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇద్దరు మహిళలు కావడంతో ఈ సభ్య సమాజం తమా పెళ్లిని అంగీకరించదు అని భావించారు. ఈ క్రమంలోనే జయసుధను పురుషుడి గా మారాలి అంటూ సెంతిలా ఒత్తిడి తీసుకు వచ్చింది.  ఇక ఆపరేషన్ చేయించుకుని జయసుధ ఆది శివ గా మారిపోయాడు. తర్వాత పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు కలిసి ఉన్నారు. కానీ ఆ తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా చివరికి మా వారి తో వెళ్ళిపోయింది సెంతిలా. తనకు న్యాయం చేయాలంటూ ఆది శివ పోలీసులను ఆశ్రయించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: