అసలేం జరుగుతుంది... నేటి రోజుల్లో యూత్ ఆలోచన తీరు ఎటు పోతుంది. బాగా చదువుకోవాల్సిన వయసులో పెడతారులు పట్టడం ఏంటి అనే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలో పడిపోతున్నారు. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు లవర్స్ కేవలం పార్కులకు వెళ్లి ఏదో పొదల చాటున కూర్చుని రొమాన్స్ చేసుకోవడం చూసాము విన్నాము కూడా. కానీ ఇప్పుడు మాత్రం యువతి యువకులు మరింత బరితెగించి పోతున్నారు అన్నది అర్థమవుతుంది. పార్కుల్లోకి వెళ్లి ఎవరికీ కనిపించకుండా పొదల చాటున రొమాన్స్ చేసుకోవడం కాదు ఏకంగా నడిరోడ్డు మీదే దుకాణం పెట్టేస్తున్నారు.


 ఇటీవల కాలంలో ఏకంగా బైక్ పై లవర్స్ రొమాన్స్ చేసుకోవడం లాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇది ట్రెండ్ అనుకుంటున్నారో ఏమో ఒకరిని చూసి మరొకరు కూడా ఇలాంటిది ట్రై చేస్తూ ఉండడం గమనార్హం. అయితే మొన్నటి వరకు కేవలం ఒక అబ్బాయి అమ్మాయి మాత్రమే బైక్ పై వెళ్తూ రొమాన్స్ చేసుకోవడం గురించి చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఇద్దరు అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయి కూర్చుంది. ఇక బైక్ ముందుకు వెళుతుంది. ఇలాంటి సమయంలో ఇక మితిమీరిన రొమాన్స్ తో రెచ్చిపోయారు యువతీ యువకులు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.



 ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అన్నది తెలుస్తుంది. ఒక యువకుడు స్కూటీ నడుపుతుండగా మధ్యలో ఒక అమ్మాయి కూర్చుంది. ఇక ఆమె వెనకాల మరో యువకుడు కూర్చున్నాడు. వెనకాల కూర్చున్న ఇద్దరు లవర్స్ కూడా ముద్దులతో హగ్గులతో రెచ్చిపోయారు. నడిరోడ్డు మీద ఉన్నాము అన్న సోయి వారిలో కనిపించలేదు. ఇక లోకాన్ని మరిచిపోయి రొమాన్స్ లో మునిగి తేలారు. ఇదంతా గమనించిన వాహనదారులు ఇక సెల్ ఫోన్ లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా  మారిపోయింది. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: