ఈ మధ్యకాలంలో మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది  బంధాలు బంధుత్వాలకు అస్సలు విలువ ఇవ్వడం లేదు  చిన్న విషయాలకే ఏకంగా సొంత వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు ఎంతోమంది. ఇక ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకొవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి . అయితే ఇప్పటి వరకు అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో హత్యలు ఆత్మహత్యలు జరిగిన ఘటనలను మనం చూశాం. ఏకంగా కట్టుకున్న వారిని మోసం చేస్తూ పరాయి వ్యక్తుల మోజులో పడిన వారు వేదమంత్రాల సాక్షిగా పెళ్ళి చేసుకున్న వారిని దారుణంగా హతమార్చడానికి కూడా వెనకాడటం లేదు.


 ప్రియుడు లేదా ప్రియురాలితో కలిసి ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన వారు ఇటీవలి కాలంలో ఎంతోమంది. ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం ఏకంగా ప్రియుడి కోసం చేయరాని తప్పు చేసింది. చిన్నప్పటినుంచీ అల్లారుముద్దుగా పెంచిన తండ్రినీ హతమార్చేందుకు సిద్ధమైంది. చిన్నప్పుడు నుంచి పెంచిన తండ్రి కంటే కొన్ని రోజుల క్రితం పరిచయమైన ఆమె ప్రియుడే ముఖ్యం అనుకుంది సదరు యువతి. దీంతో ఇక ప్రియుడి కోసం ఏకంగా కన్న తండ్రిని హతమార్చిన ఘటన  దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.



 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంబల్ కి చెందిన హారపాల్ సింగ్ అనే వ్యక్తికి కూతురు ప్రీతి ఉంది   అయితే చిన్నప్పటినుంచి తన కూతురికి ఏ కష్టం రాకుండా అల్లారుముద్దుగా పెంచాడు ఆ తండ్రి. అయితే ఇటీవలే ప్రీతి కొంతకాలంగా ధర్మేంద్ర అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతనితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రస్తుతం ప్రేమగా మారిపోయింది. అయితే ఇక వీరిద్దరి ప్రేమ కు తండ్రి ఒప్పుకోలేదు. దీంతో ఇక తండ్రి కంటే ప్రియుడే ముఖ్యం అని అనుకుంది ఆ యువతి. ప్రియుడి కోసం ఏకంగా తండ్రిని చంపేందుకు కూడా సిద్ధమైంది. అంతేకాదు తండ్రిని చంపి ఇక మళ్ళీ ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఇటీవలే వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన హారపాల్ ఇక అక్కడ ఒక చెట్టుకు ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించాడు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు అతని తలపై ఇనుప రాడ్ తో బలంగా కొట్టినట్లు ఆనవాళ్లు కనిపించడంతో ఇక పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: