మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం క్యాన్సర్ కు కారకం అని జనాలకు అవగాహన కల్పించడానికి అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూఉంటారు. ఇక సినిమాల్లోనే కాదు ఎక్కడ చూసినా ఇలాంటి పోస్టులు దర్శనమిస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా బహి రంగ ప్రదేశాల్లో పొగాకు తాగడం అనేది నిషేధం. ఇక నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం లాంటివి చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతూ ఉంటారు అధికారులు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం బహిరంగ ప్రదేశంలో కాదు ఏకంగా విమానంలోనే సిగరెట్ కాల్చడం మాత్రం సంచలనంగా మారిపోయింది.


 ఇలా విమానంలో సిగరెట్ కాల్చకూడదు అన్న నిబంధన ఉన్నప్పటికీ సిగరెట్ కాల్చి  నిబంధనలు అతిక్రమించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవ్యక్తి కువైట్ నుంచి వెళ్తున్న ఇండిగో విమానం లో ప్రయాణిస్తున్నాడు.ఇక ఈ విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక ఈ విమానంలో ఉన్న ఏపీకి చెందిన మొహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి భద్రత సిబ్బంది కళ్లుగప్పి లో దుస్తుల్లో దాచుకున్న సిగరెట్లు ఎలాగోలా విమానంలోకి తీసుకువచ్చాడు.


 ఈ క్రమంలోనే విమానం టేకాఫ్ అయింది. ఇక ఇలా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే దాచుకొని తెచ్చిన సిగరెట్ బయటకు తీశాడు. విమానంలో సిగరెట్ కాల్చకూడదు అని తెలిసికూడా స్మోకింగ్ చేయడం ప్రారంభించాడు. తోటి ప్రయాణికులు అందరూ సిగరెట్ కాల్చకూడదు అంటూ అతనితో వాదించిన కూడా వినలేదు. దీంతో వెంటనే ఇతర ప్రయాణికులు విమాన సిబ్బంది ఫిర్యాదు చేశారు.. అయితే ఎయిర్హోస్టెస్ వచ్చి చెప్పినా కూడా అతను సిగరెట్ తాగడం మాత్రం ఆపకుండా అలాగే తాగుతూ ఉన్నాడు. అంతేకాదు విమానంలో ఉన్న సిబ్బందితో గొడవకు దిగాడు. దీంతో ఇక విమానం చెన్నై లో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది షరీఫ్ ను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత అతని పోలీస్ స్టేషన్లో అప్పగించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: