ఏలూరుకు చెందిన సుధారాణి భర్త స్థాయి ప్రభు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తూ ఉంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే అంతలో సాయి ప్రభు లింగ మార్పిడి చేసుకున్నాడు.. దీంతో భర్త తీరుతో షాకైనా భార్య చివరికి భర్త సాయి ప్రభును వదిలేసి అదే ప్రాంతంలో ఉంటున్న డింపుల్ కుమార్ కు ఎంతగానో దగ్గరైంది. సహజీవనం చేయడం మొదలుపెట్టింది.. వీరికి ఒక పాప కూడా పుట్టింది. సుధారాణి మొదటి భర్త సంతానాన్ని తల్లి వద్ద ఉంచి పెంచుతుంది. ఇక డింపుల్ కుమార్ తో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు.. ఇంతలో వీరు వ్యసనాలకు బానిస గా మారి రోజూ మద్యం తాగి రాత్రులు ద్విచక్రవాహనంపై తిరుగుతూ ఉండేవారు .
అంతలో విధి వీరిని చిన్నచూపు చూసింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో అదుపు తప్పడంతో ఇద్దరూ పడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో ఘటనా స్థలంలోనే మరణించింది సుధారాణి. ప్రియురాలి మరణంతో డింపుల్ కుమార్ ఎంతో మనస్తాపం చెందాడు. వాహనం అక్కడే విడిచిపెట్టి ఇంటికి వెళ్ళాడు.. ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలోనే స్థానికులు ఉదయాన్నే గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.