ఈరోజుల్లో వేరొకరి తో అక్రమ సంభంధాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. భార్య భర్తల మధ్య చిన్న గొడవలు రావడంతో తొందరపడి తీసుకోనె నిర్ణయాలు ఒక్కోసారి జీవితాలను కూడా నాశనం చేస్తున్నాయి. అయిన కొందరు మాత్రం వెనక్కి వెళ్ళడం లేదు.. ఇప్పుడు కూడా ఇటువంటి ఘటనలు లెక్కకు మించి వెలుగు చూస్తున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త ఫ్రెండ్ పై మోజు పడ్డ భార్య మెసేజ్ లు చూసి చలించిపోయాడు. చివరికి భార్యకు బుద్ది చెప్పాలని అతన్ని అంత మొందించాడు..


వివరాల్లొకి వెళితే.. చిక్‌బళ్లా పురం జిల్లా గౌరీబిద నూర్ తాలూకాలోని కంబల హళ్లి అనే గ్రామం లో శంకర్ అనే 30 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతనిని హత్య చేసింది మరెవరో కాదు అతని స్నేహితుడు. ఇద్దరు మంచి స్నేహితులు.. లారీ డ్రైవర్, క్లీనర్ గా పని చేస్తున్నారు. అశోక్, శంకర్ స్నేహితులు కావడం తో అప్పుడప్పుడూ అశోక్ కోసం.. కొన్ని సందర్భాల్లో అశోక్‌ తో కలిసి అతని ఇంటికి శంకర్ వెళ్లేవాడు. ఆ సందర్భం లోనే అశోక్ భార్య తో శంకర్‌కు సాన్నిహిత్యం ఏర్పడింది..


అలా భర్తకు తెలియకుండా ఇద్దరు రాసలీలలు సాగించడం మొదలు పెట్టారు. పద్మ కూడా ఆమె భర్త అశోక్‌కు నమ్మక ద్రోహం చేసి అతని స్నేహితుడైన శంకర్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, వాట్సాప్ సంభాషణలు నడిచాయి. అయితే.. ఈ విషయం అశోక్‌కు చాలా ఆలస్యంగా తెలిసింది. ఇటీవల.. తన స్నేహితుడు శంకర్ ఫోన్‌లో పద్మ తో వాట్సాప్ మెసేజ్ లు చూసి ఖంగుతిన్నాడు. ఆవేశం తో పక్కనే ఉన్న ఇనుప వస్తువు తో బలంగా కొట్టాడు. అక్కడిక్కడే కుప్ప కూలిపొయి చనిపొయడు.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..


మరింత సమాచారం తెలుసుకోండి: