ఇటీవలి కాలంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుంది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు సైతం కరోనా వైరస్ బారినపడి రోజుల వ్యవధిలోనే ఆరోగ్యం క్షీణించి చివరికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇక మరికొన్ని రకాల ఘటనలు కూడా మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అయితే రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. రోడ్డు నిబంధనలు పాటించక పోవడం అతివేగం వెరిసి ఇక ఎన్నో కుటుంబాల్లో రోడ్డు ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి.


 ఇంకా ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా పాఠశాల బస్సే చిన్నారుల ప్రాణాలు తీసింది. ఈ ఘటనతో ఆ ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయనగరం జిల్లాలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల బస్సు ఢీ కొట్టిన ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం పరిధిలోని టెక్కలి రావివలస వద్ద రహదారి పై ప్రైవేట్ పాఠశాల బస్సు వేగంగా వెళుతుంది. ఈ ఇక ఆ బస్సు ముందు ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ప్రైవేట్ బస్సు.


 అయితే ప్రమాద సమయంలో ఏకంగా ద్విచక్రవాహనంపై ఐదుగురు చిన్నారులు ప్రయాణిస్తూ ఉండడం గమనార్హం. ఇక బైక్ ఎగిరి పడిపోవడంతో చిన్నారులు రోడ్డుపై పడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలై చిన్నారుల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇక చిన్నారులు అందరూ కలిసి జాతర కు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం  అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులు సిద్దు, హర్ష, రుషిగా గుర్తించారు. వీరందరికీ  9 ఏళ్ల లోపు వయసు ఉంటుందని చెప్పారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి: