రాజస్థాన్లోని ముహనాలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల బాలిక జూన్ 26 ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా కూతురి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ టీమ్ సహాయం తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి బాలిక భరత్పూర్ వెళ్లినట్టు తెలుసుకున్నారు. దేవ్పాల్ అనే వ్యక్తితో బాలిక వెళ్లడం గమనించి అతడిని పట్టుకున్నారు. అతడి ద్వారా మొత్తం విషయం తెలుసుకున్నారు. రూ.5000కు బబ్లూ అనే వ్యక్తికి ఆ బాలికను అమ్మేసినట్టు తెలుసుకున్నారు..అతను చెప్పిన అడ్రెస్ ప్రకారం అక్కడకు వెళ్ళి చూడగానే బాలిక ఉందని తెలుసుకొని విడిపించారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..బబ్లూ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు..
రాజస్థాన్లోని ముహనాలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల బాలిక జూన్ 26 ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా కూతురి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ టీమ్ సహాయం తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి బాలిక భరత్పూర్ వెళ్లినట్టు తెలుసుకున్నారు. దేవ్పాల్ అనే వ్యక్తితో బాలిక వెళ్లడం గమనించి అతడిని పట్టుకున్నారు. అతడి ద్వారా మొత్తం విషయం తెలుసుకున్నారు. రూ.5000కు బబ్లూ అనే వ్యక్తికి ఆ బాలికను అమ్మేసినట్టు తెలుసుకున్నారు..అతను చెప్పిన అడ్రెస్ ప్రకారం అక్కడకు వెళ్ళి చూడగానే బాలిక ఉందని తెలుసుకొని విడిపించారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..బబ్లూ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు..