ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. భర్త మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఇన్నాళ్లు తనతో పాటే ఉన్న భర్త ఇక లేడు అన్న విషయం జీర్ణించుకోలేక పోయింది. భర్త చనిపోయి 20 గంటలు అయిన కాలేదు కట్టుకున్న వాడిని వెతుక్కుంటూ కానరాని లోకాలకు వెళ్లిపోయింది. సిరి మామిడి పంచాయితీ తో తోటూరు గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త సుందరరావు భార్యతో కలిసి ఉపాధి నిమిత్తం బిలాయి లో ఉంటున్నాడు.
అయితే ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు సుందరరావు. ఇక భర్త కానరాని లోకాలకు వెళ్లిపోయాడు అని భార్య పుణ్యవతి ఎంతగానో మనస్తాపం చెందింది. ఇక భర్త లేని జీవితం ఎలా అనే విషయం తల్చుకుంటేనే ఆమెకు భయమేసింది. దీంతో ఇదే మనస్థాపంతో ఆమె గుండె ఆగిపోయింది. భర్త చనిపోయిన కేవలం 24 గంటల వ్యవధిలోనే అంటే నేను నీ వెంటే అనేలా చివరికి ప్రాణాలు వదిలింది. భార్యాభర్తల మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు అని చెప్పాలి. కాగా చిన్న కుమారుడి వివాహం ఈ నెల 20న చేయాలని నిర్ణయించినా అనివార్య కారణాలతోపెళ్లి వాయిదా పడటం గమనార్హం.