సాధారణంగా భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు చిరునమాగా ఉండాలి అనే విషయం తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు. పెళ్లి అనే బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఎంతో మంది యువతీ యువకులు.. ఒకరంటే ఒకరు ప్రేమ అభిమానంతో మాత్రం అస్సలు జీవించడం లేదు. అయితే భార్యాభర్తల బంధం లో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. ఇలాంటి చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోయి బ్రతకడం మానేసి.. ఇక ఈగోలకు పోయి నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాలను ఇక నడిరోడ్డుపై పెడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 అంతేకాదు ఇక భార్య భర్తలు ఇద్దరి మధ్య ఉండాల్సిన విషయాలను కూడా ఏకంగా కోర్టుల వరకు తీసుకువెళ్తున్న ఘటనలు కూడా ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరిని అవ్వక్కయ్యేలా చేస్తూ ఉన్నాయని చెప్పాలి. భర్త శృంగారం చేయడం లేదని భార్య.. ఇక తనతో శృంగారానికి భార్య ఒప్పుకోవడం లేదని భర్త ఇలా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అయితే ఇలా పర్సనల్ విషయాలతో కోర్టుకు వెళ్లడమే షాకింగ్ అనుకుంటే.. అటు కోర్టులు ఇస్తున్న తీర్పులు మరింత షాకింగ్ గా ఉన్నాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య ఉండే శారీరక బంధం విషయంలో ఇటీవల కోర్టు షాకింగ్ తీర్పును వెల్లడించింది. తనతో శారీరక సంబంధానికి నిరాకరించిన భర్త పై భార్య క్రిమినల్ కేసు పెట్టింది. అయితే ఇక ఈ కేసు హైకోర్టులో విచారణ జరగగా.. కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భర్త శృంగారానికి దూరంగా ఉండడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరమే. కానీ ఐపిసీ సెక్షన్ 498 ఏ ప్రకారం నేరం కాదు అంటూ కోర్టు స్పష్టం చేసింది. 2019లో జంటకు పెళ్లి అవ్వగా.. ప్రేమ మనసుకు సంబంధించినదని భావించిన భర్త.. భార్యతో శృంగారానికి నిరాకరించాడు. దీంతో భార్య అతనిపై క్రిమినల్ కేసు పెట్టగా కోర్టు దానిని కొట్టి వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: