కవిత ఈడీ విచారణకు వెళ్లకుండా మొన్న ఆకస్మాత్తుగా ఆగిపోవడానికి కారణం ఏంటని చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఈడీ రామచంద్ర పిళ్లై ను, అభిషేక్ ను, కవితను ఒక దగ్గర చేర్చి విచారణ చేస్తారు. అలాంటి సమయంలో వారు గతంలో చెప్పిన ఆధారాలను పూర్తి వివరాలతో ముందుగా కవితకు వినిపిస్తారు. తర్వాత అందరిని కలిపి ఒకే దగ్గర కూర్చుని విచారణ జరుపుతారు. గతంలో పిళ్లై చెప్పిన సాక్ష్యాలను ఆమె ముందు వివరిస్తారు. అన్ని ప్రశ్నలను ముగ్గురిని కలిపి అడగడంతో అక్కడ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈడీ అన్ని ఆధారాలను సేకరించింది. రామచంద్ర పిళ్లై స్టేట్ మెంట్ రికార్డు చేసింది. బోయినపల్లి అభిషేక్ స్టేట్ మెంట్ ను కూడా రికార్డు చేసింది. తదనంతరమే ఈడీ కవితను పిలిచింది.  


మొదటి సారి వెళ్లిన కవితను ఈడీ 9 గంటల పాటు విచారించింది. తర్వాత 16 న వెళ్లాల్సి ఉండగా విచారణకు వెళ్లకుండా సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. దీనిపై ఈడీ కూడా సుప్రీం కోర్టుకు వెళ్లి విచారణ జరగకుండా స్టే ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని అడిగింది. కవిత ఆకస్మాత్తుగా విచారణకు రాకపోవడం కారణం.. ఆ రోజు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. మరో విషయం రామచంద్ర పిళ్లై చెప్పిన అన్ని వివరాలు కవితే చేయించిందని స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఇరాకాటంలో పడింది.


దీంతో న్యాయనిపుణులను సంప్రదించిన ఆమె విచారణకు హాజరు కాలేనని ఆరోగ్యం బాగో లేదని చెప్పింది. మహిళలను ఇంటి వద్దే విచారించాలని ఉన్నా.. కావాలనే ఈడీ టార్గెట్ చేస్తుందని తన ఫోన్ ను లాక్కుందని ఆరోపించింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఈడీపై ఆరోపణలు చేసింది. సుప్రీం కోర్టు 24 న కేసు విచారణ జరుపుతామని చెప్పింది. ఈడీ 20నే రావాలని కవితకు మరోసారి నోటీసులు పంపించింది. మరి ఇవాళ విచారణ ఎలా సాగుతుందో ఏమో..?

మరింత సమాచారం తెలుసుకోండి: