ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను చూపించి ప్రజల నుంచి ఓట్లను రాబట్టుకోవడం అనేది రాజకీయ పక్షాలకు తెలిసిన విద్య. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలను చూపి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. బాగా చేసిన వాళ్ళు గెలవచ్చు. లేదు బాగా చేయలేని వారు ఓడిపోవచ్చు. కానీ ప్రస్తుతం సంక్షేమ పథకాలను అందించే విషయం లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సరికొత్త పంథా ఎంచు కొని ముందుకు సాగుతున్నాయి.


తెలంగాణలో రైతు బంధు నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావడం, గతంలో ఇలాంటి పథకాలు అంటే కేవలం పెన్షనర్లకు మాత్రమే చేతికి డబ్బులు అందేది ప్రస్తుతం ప్రతి రైతుకు డబ్బులు అనేవి ప్రభుత్వం నేరుగా ఇస్తుంది. ఇది చాలావరకు ప్రభావం చూపిస్తుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్కూలు పిల్లల తల్లిదండ్రులకు వారి ఖాతాల్లో డబ్బులు ఇస్తున్నాడు. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకమైనప్పటికీ ఇప్పుడు దాని పేరు మార్చి నేరుగా ప్రజల ఖాతాలోకి డబ్బులు రావడంతో వారు ఎంతో సంతోషంగా ఉంటున్నారు.


ప్రజల ఓట్లను తమ పార్టీ వైపు వేయించుకోవడానికి తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలను తెలుస్తుంది. ప్రజల సొమ్ముతో ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వాలు అధికారాన్ని చెలాయిస్తుంటాయి. అదే సొమ్మును సంక్షేమ పథకాల రూపంలో తీసుకువచ్చి మళ్ళీ మా ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది గొప్పలు చెప్పుకొని అధికారం కోసం నూతన పథకాలు ప్రవేశపెడుతుంటారు.


ప్రస్తుతం తెలంగాణలో రైతు రుణమాఫీ గృహ లక్ష్మీ పథకం బీసీ బంధు మైనారిటీ బందు ఇలా అనేక రకాల పథకాలను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఎన్నికలు ఉన్నటువంటి వేళ స్పీడ్ గా చేసి ఇస్తున్నారు. ఇన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి పనులు సైతం  ఇపుడు చురుగ్గా సాగిపోతున్నాయి. దీనికి కారణం మళ్లీ అధికారంలోకి రావడం అనే ఒక ఆశ ఉండడం వల్లనేనని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr