ప్రస్తుతం  జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో రెండు కశ్మీర్ కి సంబంధించిన రెండు కీలక బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది. అందులో కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు (సవరణ) బిల్లు, అలాగే జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లులు ఉన్నాయి.  జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం అక్కడ అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది.


అయితే బిల్లుల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ బిల్లులోని కీలక అంశాలను వెల్లడించారు. గతంలో జమ్మూ కాశ్మీర్ లో శాసన సభ నియోజకవర్గాలు సంఖ్య 83 ఉండగా.. తాజాగా ఆ సంఖ్యను 90కి పెంచాలని ప్రతిపాదించారు. ఇంతకుముందు కశ్మీర్ డివిజన్ లో 37 స్థానాలు ఉండేవి. ఇప్పుడా ఆ సంఖ్య47కి చేరింది. మరోవైపు జమ్ములో 43 కి పెంచినట్లు అమిత్ షా తెలిపారు.


మరోవైపు పీవోకే గురించి కూడా కీలక  వ్యాఖ్యలు చేశారు.  పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికి మన దేశంలో భాగమేనని పేర్కొన్నారు. అందుకే అక్కడ కూడా 24 స్థానాలు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఇక కశ్మీర్ లో రెండు స్థానాలను అక్కడి నుంచి వలస వెళ్లిన వారు, ఒక స్థానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చి స్థిరపడిన వారికి కేటాయించినట్లు వివరించారు.  తొలిసారిగా ఎస్సీ  ఎస్టీ  కమ్యూనిటీ లకు 9 స్థానాలు కేటాయించినట్లు పేర్కొన్నారు.  


70 ఏళ్లుగా అన్యాయానికి, అనుమానాలకు గురైన వారికి న్యాయం చేసేందుకు ఈ బిల్లులను ప్రవేశపెడుతున్నామన్నారు. ఏ సమాజంలోనైనా వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావాలని. ఈ క్రమంలో వారి గౌరవానికి ఏ మాత్రం భంగం కలుగకుండా చూడాలన్నారు. అదే భారత రాజ్యాంగ ప్రాథమిక ఉద్దేశం. ప్రస్తుతం చాలా మంది కాశ్మీరీలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ బిల్లులతో వారికి హక్కులు, ఉద్యోగాలు, విద్యావకాశాలు రిజర్వేషన్ల సాయంతో ఎన్నికల్లో నిలబడే అవకాశాలు వస్తాయని అమిత్ షా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: