నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వేలకు వేలు ఖర్చు పెడుతూ కోచింగ్ తీసుకుంటూ ఎన్నో నెలల నుంచి యుపిఎస్సి పరీక్షల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే వారి నిరీక్షణకు ప్రస్తుతం పులిస్టాప్ పెట్టే సమయం వచ్చేసింది.. ఏమిటంటే నిరుద్యోగులకు ఇది ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. 2022 సంవత్సరానికి గాను యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదలయింది. ఈసారి ఏకంగా 861 ఉద్యోగాల భర్తీని పూర్తి చేయనున్నట్లు సమాచారం.. అయితే ఎగ్జామ్ రాయడానికి అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఎగ్జామ్ రాయడానికి అర్హులే..

ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరడం జరుగుతుంది. ఐఏఎస్ , ఐపీఎస్ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.. ఇక ఇందులో మీరు పూర్తి వివరాల కోసం.. https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌ ను సందర్శించవచ్చు..

ఈ పోస్టుల వివరాలు విషయానికి వస్తే..

మొత్తం ఖాళీలు - 861
అర్హత - ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు.

వయోపరిమితి: 2022 ఆగస్టు 1 నాటికి 21 సంవత్సరాలు వుండాలి . అంతేకాదు 32 సంవత్సరాలు మించి ఉండకూడదు. 1990 ఆగస్టు 2 నుండి 2001 ఆగస్టు ఒకటి మధ్య జన్మించిన వారు అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వంటి రిజర్వడ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటాయి.

ఎంపిక విధానం:
రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే రాత పరీక్ష ప్రిలిమ్స్ ఆ తర్వాత మెయిన్స్ అనే రెండు స్టేజ్ లలో ఉత్తీర్ణులు అవ్వాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ 2022 ఫిబ్రవరి 22.. ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 2022 జూన్ 5.. దరఖాస్తు ఫీజు ఓబీసీతో పాటు ఇతర అభ్యర్థులకు ₹100 , ఎస్సీ ,ఎస్టీ, పిడబ్ల్యుడి  అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: