ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) విశాఖపట్నంలో పేహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ రిలీజ్ అయ్యింది.బయోసైన్స్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎర్త్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌ ఇంకా మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ఇంకా అలాగే పెట్రోలియం ఇంజనీరింగ్‌ వంటి స్పెషలైజేషన్ లలో పీహెచ్ డీ చేసేందుకు ఛాన్స్ ఉంది. రెగ్యులర్‌, స్పాన్సర్డ్‌, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఇంకా అలాగే ఇండివిడ్యువల్‌ ఫెలోషిప్‌ కేటగిరీల్లో ప్రోగ్రామ్‌ అనేది అందుబాటులో ఉంది.ఇక అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, సైన్స్‌ విభాగాల్లో ప్రధమ శ్రేణి మార్కులతో ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌ ఇంకా అలాగే ఎమ్మెస్సీ ఉత్తీర్ణఉలైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్పీ ఇంకా అలాగే ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే నిర్దేశించిన ఇంజనీరింగ్‌ విభాగాల్లో బీఈ లేదా బీటెక్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా అర్హులే. రెగ్యులర్‌ అభ్యర్థులకు వ్యాలిడ్‌ గేట్‌ ఇంకా నెట్‌ ఎన్‌బీహెచ్‌ఎం స్కోర్‌ అనేది ఉంటేనే సంస్థ రిసెర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌ అందిస్తుంది.


ఐఐటీలు, ఐఐఎస్సీలు, ఐఐపీఈ, ఆర్‌జీఐపీటీ సంస్థల నుంచి కనీసం 75 శాతం మార్కులతో బీఈ ఇంకా బీటెక్‌ డ్యూయెల్‌ డిగ్రీ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఇంకా అలాగే రెండేళ్ల ఎమ్మెస్సీ పూర్తి చేసిన వారికి నేరుగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కల్పించడంతో పాటు రిసెర్చ్‌ అసిస్టెంట్‌ షిప్ ని కూడా అందిస్తారు. అలాగే ఇండివిడ్యువల్‌ ఫెలోషిప్‌ కేటగిరీ కింద అప్లయ్‌ చేసుకోవాలంటే సీఎస్‌ఐఆర్‌, యూజీసీ, డీఎస్‌టీ , డీబీటీ ఇంకా అలాగే ఐసీఎంఆర్‌ పెలోషివ్‌ పొంది ఉండాలి. వ్యాలిడ్‌ అవార్డ్‌ లెటర్‌ను దరఖాస్తుకు యాడ్ చెయ్యాల్సి ఉంటుంది. స్పాన్సర్డ్‌ కేటగిరీ అభ్యర్థులకు బోధన ఇంకా అలాగే రిసెర్చ్‌ అనుభవం ఉండాలి. వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ప్రోగ్రామ్‌లో చేరేనాటికి వారు పనిచేస్తున్న ప్రాజెక్ట్‌ వ్యవధి కనీసం రెండు సంవత్సరాలు ఉండాలి.ఇక రిసెర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌ విషయానికి కనుక వస్తే సంస్థ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు మాక్సిమం అయిదేళ్లపాటు రిసెర్చ్‌ అసిస్టెంట్‌షిప్ అనేది ఇస్తారు. మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ.31,000 ఆ తరువాత మూడేళ్లు నెలకు రూ.35,000 ఇస్తారు. కంటింజెన్సీ గ్రాంట్‌ కింద సంవత్సరానికి రూ.30,000 ఇస్తారు. 


అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఇంకా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి మెరిట్‌ ప్రకారం అడ్మిషన్స్‌ ఇస్తారు. దివ్యాంగులు, ఎస్సీ ఇంకా అలాగే ఎస్టీ అభ్యర్థులకు ట్యూషన్‌ ఫీజు ఉండదు. దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్‌ అభ్యర్థులకు రూ.300, మహిళలు, దివ్యాంగులు, ఎస్పీ ఇంకా అలాగే ఎస్టీ అభ్యర్థులకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి మే 31, 2022గా నిర్ణయించారు. రిటెన్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఇంకా అలాగే ఇంటర్వ్యూలు జూన్‌ 6 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్‌ 15, 2022న రిలీజ్ చేస్తారు. అడ్మిషన తేదీ జూలై 25 వ తేదీగా ప్రకటించారు. ఇక పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.iipe.ac.in పరిశీలించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: