అందువలన గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగిన బంగారు కొనుగోళ్లు మరియు ఈ సంవత్సరం జరిగిన బంగారు కొనుగోళ్లలో భారీ మార్పు చోటు చేసుకుంది. కేవలం ఒక్క సెప్టెంబర్ నెలలోనే 658 శాతం బంగారు కొనుగోలు పెరగడం గమనార్హం. గత సంవత్సరం ఆగస్టు నెలలో బంగారం ఔన్స్ ధర 2072 డాలర్లకు పెరిగింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కానీ ఇప్పుడు అది కాస్తా దాదాపు 15 శాతం తగ్గింది. తద్వారా విదేశాల నుండి భారతదేశానికి తెచ్చుకునే బంగారు క్వాంటిటీ పెరిగిపోయింది.
ఇక మనకు తెలిసిందే దీని ఫలితంగా రూపాయికి మరియు డాలర్ కు తేడా ఇంకా పెరిగిపోయింది. ఇలా పలు కారణంల వలన బంగారం రిటైల్ ధర పెరిగింది. గత సంవత్సరం తో పోలిస్తే ఈ సారి గత నెలలో 91 టన్నుల మేరకు బంగారం దిగుమతి పెరిగాయి. ప్రస్తుతానికి స్థానికంగా గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములు 45,479 రూపాయలకు పడిపోయింది. దేనితో బంగారం ధరల్లో రోజు రోజుకి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న భారీగా పెరిగిన దారాలుబి నేడు మాత్రం స్వల్పంగా తగ్గాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి