క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు ఏప్రిల్ 30వ కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో.. ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ప్రముఖల జననాలు:
1870: భారతీయ
సినిమా పితామహుడి, నిర్మాత-దర్శకుడు-స్క్రీన్ రైటర్ దాదాసాహెబ్ ఫాల్కే. (మ.1944)
1891: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, శతావధాని, నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేసిన గొప్ప కవి. (మ. 1945)
1901: సైమన్ కుజ్నెట్స్, ఆర్థికవేత్త. (మ.1985)
1902: థియోడర్ షుల్జ్, ఆర్థికవేత్త,
నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1998)
1910: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (మ.1983)
1921: రోజర్ లీ ఈస్టన్, అమెరికన్ శాస్త్రవేత్త.(మ. 2014)
ప్రముఖుల మరణాలు:
1883: ఎడ్వర్డ్ మానెట్, ఫ్రెంచ్ ఆధునిక చిత్రకారుడు. (జ.1832)
1945: అడాల్ఫ్ హిట్లర్, జర్మన్ నియంత. (జ.1889)
సంఘటనలు:
1945: అడాల్ఫ్ హిట్లర్ తన
భార్య ఎవా బ్రాన్తో కలిసి బెర్లిన్లోని ఫుహ్రర్బంకర్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
2012: భారతదేశంలోని బ్రహ్మపుత్ర నదిపై ఓవర్లోడ్ ఫెర్రీ బోల్తా పడి కనీసం 103 మంది మృతి చెందారు.
1946: మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టారు.
1975: దక్షిణ వియత్నాం (సైగాన్) ఉత్తర వియత్నాం దేశానికి లొంగిపోయి వియత్నాం యుద్ధానికి ముగుంపు పలికింది.
1986: ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరారు.
జాతీయ దినాలు:
ప్రపంచంలోని అన్ని మూలల్లో ప్రజలను ఏకం చేయడంలో ఏప్రిల్ 30ను
అంతర్జాతీయ జాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు.