ఇటీవల భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆయన వయసు మరీ పెద్దదేమీ కాదు. అందుకే శరీరం ఫిట్గా ఉంది కదా.. మాకు గుండెజబ్బు రాదు అనుకోవడానికి లేదు. వయసు పెరుగుతున్నకొద్దీ.. 45 ఏళ్లు దాటిన తర్వాత గుండెజబ్బు ముప్పు పెరుగుతుంది. అందుకే వ్యాయామం చేస్తున్నా, ఆటలు ఆడుతున్నా మధ్యవయసులో క్రమం తప్పకుండా డాక్టర్ను సంప్రదించటం తప్పనిసరి. ముఖ్యంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ గలవారికి.. కుటుంబంలో ఎవరైనా గుండెజబ్బుల గలవారికిది తప్పనిసరి.
అధిక కొలెస్ట్రాల్ గలవారికి.. కుటుంబంలో ఎవరైనా గుండెజబ్బుల గలవారికిది తప్పనిసరి ఎందుకంటే.. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారిలో శరీరం అదనపు కొవ్వును బయటకు వెళ్లగొట్టలేదు. అందువల్ల రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు పెరుగుతూ వస్తుంటాయి. ఇది రక్తనాళాల లోపలి గోడల్లో పోగుపడుతుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో పోగుపడి, పూడికలు ఏర్పడతాయి.. రక్తనాళాల లోపలి మార్గం సన్నగా మారుతుంది.
ఈ పూడికల సైజు పెరుగుతున్నకొద్దీ గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. ఫైనల్ గా ఇది గుండెనొప్పికి దారితీస్తుంది. ఆ తర్వాత గుండెపోటు వస్తుంది.. ఒక్కోసారి గుండెనొప్పి వంటి లక్షణాలేవీ లేకుండానే ఉన్నట్టుండి గుండెపోటూ రావొచ్చు. అందుకే 40 ఏళ్లు దాటినవారు క్రమం తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. 40 ఏళ్లు పైబడినవారు కనీసం ఏడాదికి ఒకసారైనా ఈ పరీక్షను చేయించుకోవాలి.