నడుము నొప్పితో ఎక్కువగా బాధపడతారు నప్పుడు ఒక గ్యాస్ మజ్జిగలో 3 టేబుల్ స్పూన్లు సున్నపు తేటను కలుపుకొని ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల మూడు నాలుగు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఖర్జూర పండ్లు కూడా బాగా ఉపయోగపడతాయి. రోజు కొన్ని ఖర్జూర పండ్లు తిని వేడి నీళ్లు తాగితే నడుము నొప్పి తగ్గిపోతుంది.
మేడి కొమ్మ పాలు తెచ్చి నడుము నొప్పి ఉన్న చోట ఆ పాలతో పట్టువేస్తే నడుము నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది.
నల్ల మందు, రసకర్పూరం, రెండింటిని తీసుకొని కొబ్బరి నూనెలో కలిపి నొప్పి ఉన్నచోట అప్లై చేయడం వల్ల అప్పటి నుంచి ఉపశమనం పొందొచ్చు.
కొంచెం శొంఠి, కొంచెం గంధం కలిపి నడుము కు పట్టు వేసి దానిపై తెల్ల జిల్లేడు ఆకులను కట్టడంవల్ల నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్లు పై చిట్కాలను ఉపయోగించు కొని నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందండి