ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక 5 రోజుల పాటు నైరుతి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. దీనితో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యి లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను మార్చాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. అయితే ఈ వర్షాల కారణంగా ఆరోగ్యం ఆపదవుతుందని తెలిసిందే. ఇందుకోసం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి రోగం మనల్ని దరి చేరకుండా ఉంటుందని కొందరు ఆరోగ్యనిపుణులు సలాహాలు ఇస్తున్నారు.
* వర్షాకాలం లో ఎక్కువగా వర్షాలు పడడం సహజమే.. అంతా మాత్రాన మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా వర్షంలో తడవకుండా ఉండడం వలన చాలా వరకు మీరు కొన్ని రకాల వ్యాధుల నుడ్ని బయట పడవచ్చు.
* ఇక సహజంగానే వర్షాకాలం అనగానే జలుబు, దగ్గు చిన్న పాటి జ్వరం వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ప్రతి రోజూ ఎక్కువ సార్లు బాగా కాచి వడపోసిన నీటిని తాగుతూ ఉండాలి. ఎటువంటి పరిస్థితులలో మంచి నీటిని డైరెక్ట్ గా తీసుకోవడం మంచిది కాదు.
* ఎక్కువగా జ్వరం, జలుబు, విరేచనాలు ఈ కలుషితమైన నీటి ద్వారానే వ్యాప్తి చెందుతాయి.
* జ్వరం వచ్చి రెండు రోజుల వరకు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
* ఆహారపు అలవాట్లను కూడా కొంచెం మార్చుకోండి... వేడి పదార్ధాలను ఎక్కువగా తీసుకోండి.
* ముఖ్యంగా వర్షాకాలంలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తీసుకోవడం చాలా ప్రమాదం.