గోరువెచ్చని నీరు: ముఖ్యంగా ఈ వర్షాకాలంలో గోరు వెచ్చని నీటిని తీసుకుంటూ ఉండాలి. దీని వలన మన శరీరం అనారోగ్యం పలు కాకుండా ఉంటుంది. ఇంకా మన జీర్ణ వ్యవస్థ తీరు కూడా సరిగా ఉంటుంది.
పసుపు: మనము విరివిగా వాడే పసుపు లో యాన్తి బాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పసుపును కనుక గోరు వెచ్చని నీటిలో కొంచెం మిరియాల పొడి వేసుకుని తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు మన దరి చేరకుండా చూసుకుంటుంది.
వెల్లుల్లి: వంటలో మనము ఉపయోగించే వెల్లుల్లి లో వేడిని కలిగించే గుణం ఉంటుంది. అందుకే దీనిని మనము ప్రతి కూరలోనూ ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటాము. దీని వలన బాక్టీరియా ఇన్ఫెక్షన్ ల నుండి తప్పించుకోవచ్చు.
జీలకర్ర: ఎక్కువగా మనము రసం మరియు తాలింపులలో జీలకర్రను వాడుతూ ఉంటాము. ఈ జీలకర్రలో పొటాషియం, ఐరన్, విటమిన్ సి, ఈ మరియు కే లు ఉంటాయి. వీటి వలన శరీరం నీరస పడకుండా చూసుకోవడంతో పాటు మన సర్రేరంలో ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది.
బొప్పాయి: ఇందులో సమృద్ధిగా యాన్తి యాక్సిడెంట్ లు మరియు పీచు పదార్ధం ఉంటాయి. ఇది మాన్ పొట్టలో ఉండే ప్రేగులను శుభ్రపరుస్తుంది. ఇది వర్షాకాలంలో జ్వరాలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.