పొట్ట రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం ఇంకా పంచదారతో చేసిన పదార్థాలను తీసుకోవడం అలాగే వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల వల్ల మనం అధిక బరువు సమస్య బారిన పడుతున్నాము. అధిక బరువు వల్ల మనం బీపీ, షుగర్, థైరాయిడ్ ఇంకా అలాగే గుండె జబ్బులు వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే మనం అధిక బరువును సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవాలి. అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం ఇంకా ఆహార నియమాలు పాటించడం వంటివి చేస్తూ ఉంటారు.ఇంకా అలాగే మార్కెట్ లో వివిధ రకాల బరువు తగ్గించే మందులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ మనలో చాలా మంది బరువు తగ్గరు.దానికి ఈ సింపుల్ చిట్కా ట్రై చెయ్యండి.ముందుగా అల్లంపై ఉండే పొట్టును తీసి దానిని ముక్కలుగా చేసుకోవాలి.ఇంకా  అలాగే కీరదోసను కూడా తీసుకొని దానిని ముక్కలుగా చేసుకోవాలి.


ఇప్పుడు ఒక జార్ లో అల్లం ముక్కలను ఇంకా కీరదోస ముక్కలను వేసి జ్యూస్ లాగా చేసుకోని ఆ తరువాత ఈ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న కీరదోస జ్యూస్ ను రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి. అలాగే దీనిని తాగిన ఒక గంట దాకా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ జ్యూస్ తయారీలో వాడిన ప్రతి పదార్థం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో చాలా బాగా సహాయపడతాయి.అలాగే ఈ విధంగా కీరదోస జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం బరువు తగ్గడంతో పాటు ఇంకా ఇతర ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పని చేస్తుంది.అలాగే శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. ఈ విధంగా మన ఇంట్లో అల్లం, కీరదోస ఇంకా నిమ్మరసంతో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం బరువు తగ్గడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: