ప్రస్తుతం మన దేశంలో  డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం నుంచి దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 300 కేసులు నమోదయ్యాయి. ఈమధ్య వచ్చిన వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల నుంచి నీరు తగ్గుముఖం పట్టడంతో అక్కడ ఈ తరహా వ్యాధులు బాగా పెరిగాయి. అయితే ఈ డెంగ్యూ ఇన్ ఫెక్షన్ శరీరంలోకి పెరిగితే ప్రధానంగా రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రాణాలు కూడా కోల్పోవల్సి వస్తుంది. అందుకే మన రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుకోవడం చాలా అవసరం. సహజ పద్ధతుల్లో ప్లేట్ కౌంట్ పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుకోవడానికి హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. పెరిగిన ద్రవ వినియోగం అనేది శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. వేగంగా కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది. అందుకే హెర్బల్ టీలు, సూప్, లెమన్ వాటర్ వంటివి తీసుకుంటూ ఉండాలి.గ్రీన్ వెజ్జీలను ఖచ్చితంగా తీసుకోండి.. ఇష్టమైనవి కానప్పటికీ, ఆకు కూరలను ఖచ్చితంగా ప్రతిరోజూ భోజనంలో చేర్చుకోవాలి. ఈ కూరగాయలు రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్యను మెరుగుపరచడానికి ఇంకా రికవరీ వేగాన్ని పెంచడానికి అవసరమైన అన్ని పోషకాలను కలిగి ఉంటాయి.


బీట్‌రూట్, బ్రోకలీ, బచ్చలికూర వంటి కూరగాయలలో ఐరన్, విటమిన్లు ఇంకా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి గట్ బ్యాక్టీరియాను మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి.మూలికలు, సుగంధ ద్రవ్యాలు ప్రత్యేకంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ ఇంకా యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి అలాగే బ్లడ్ ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడతాయి. పసుపు, అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు ఇంకా వెల్లుల్లి డెంగ్యూ జ్వరం నుండి కోలుకోవడానికి సహాయపడే కొన్ని మంచి మూలికలు. ఇవి మీ వంటగదిలోనే అందుబాటులో ఉంటాయి.మనకు ప్లేట్‌లెట్స్‌ పెరగడానికి పండ్లు కూడా ముఖ్యమైనవి.ప్లేట్‌లెట్స్ పెరగాలంటే పోషకాలు, విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా ఫైబర్ అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. డెంగ్యూ నుంచి కోలుకోవడానికి కివీస్, చెర్రీస్, యాపిల్స్ మీ ఫ్రూట్ బౌల్‌లో చేర్చవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: