చరిత్రలో ఈనాడు జరిగిన ముఖ్య సంఘటనలు ఇవే...ఇక చరిత్రలో ఈ రోజుని స్పెయిన్ జాతీయదినోత్సవం గా జరుపుకుంటారు.ఇక చరిత్రలో ఈ రోజు 1930 వ సంవత్సరంలో మొదటి ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు మాంటే వీడియో నగరంలో ప్రారంభమవ్వడం జరిగింది.ఇక 1949 వ సంవత్సరంలో కాశ్మీర్ లో యుద్ధ విరమణ జరిగింది.ఇక అదే సంవత్సరంలో భారత రాజ్యాంగము అనేది చట్టబద్ధమయిందట.ఇక 2015 వ సంవత్సరంలో ఇరవై ఏళ్లకు ఒకసారి వచ్చే పూరీ జగన్నాథస్వామి నవకళేబర యాత్రలో సుమారు 15 లక్షలమంది పాల్గొనడం జరిగింది.ఇక 1856 వ సంవత్సరంలో తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి జన్మించారు. ఈయన గొప్ప తెలుగు కవి మొత్తం 19 గ్రంథాలు రచించారు.1860 వ సంవత్సరంలో జయంతి రామయ్య పంతులు జన్మించారు. ఈయన ఆంధ్ర వాజ్మయానికి చేసిన సేవ సర్వతోముఖమైనది.ఇక 1918 వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జన్మించారు.1919 వ సంవత్సరంలో జయచామరాజ వడయార్‌ బహదూర్‌ జన్మించారు. ఈయన మైసూరు సంస్థానానికి 25వ ఇంకా చివరి మహారాజు.

1920 వ సంవత్సరంలో ఆవుల జయప్రదాదేవి జన్మించారు. ఈయన మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి.1931 వ సంవత్సరంలో భవనం వెంకట్రామ్ జన్మించారు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.1949 వ సంవత్సరంలో డెన్నిస్ లిల్లీ జన్మించారు. ఈయన ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.1974 వ సంవత్సరంలో ఎస్వీ రంగారావు మరణించారు. ఈయన తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు.1992 వ సంవత్సరంలో విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్ మరణించారు. ఈమె లాబిస్ట్ ఉపాధ్యాయురాలు ఇంకా పౌర హక్కుల కార్యకర్త.1995 వ సంవత్సరంలో రెంటాల గోపాలకృష్ణ మరణించారు. ఈయన ప్రసిద్ధి చెందిన పత్రికా రచయిత అలాగే మంచి కవి.2012 వ సంవత్సరంలో రాజేష్ ఖన్నా మరణించారు. ఈయన హిందీ సినిమా నటుడు, నిర్మాత ఇంకా రాజకీయవేత్త.

మరింత సమాచారం తెలుసుకోండి: