ఇటీవల కొద్దికాలంగా ఓవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు నటుడిగా రాణిస్తూ ముందుకు సాగుతున్న నటుడు అడివి శేష్. కొద్దిరోజులుగా తన సినిమాలకు తానే కథారచన చేస్తున్న శేష్, త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఎవరు మూవీ స్క్రిప్ట్ విషయంలో కూడా పనిచేచేయడం జరిగింది. నూతన దర్శకుడు వెంకట్ రాంజీని దర్శకుడిగా పరిచయం చేస్తూ పివిపి సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలై ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సంపాదించింది. 

ఇక నేడు ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని నాచురల్ స్టార్ నాని తన చేతులమీదుగా విడుడల చేసారు. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తుంటే సినిమాలో ఎన్నో ఆసక్తికర సన్నివేశాలతో పాటు, పలు ట్విస్టులు కూడా ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఈ ట్రైలర్, సినిమా పై అంచనాలు అమాంతం పెంచేసిందనే చెప్పాలి. ఒక మర్డర్ మిస్టరీ ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ వాసుదేవ్ అనే లంచగొండి పోలీస్ ఆఫీసర్ పాత్రలో శేష్ నటిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్స్ మాదిరిగానే తమ సినిమా కూడా సాగుతుందని, అయితే సినిమాలోని కొన్ని కీలక ట్విస్టులకు ప్రేక్షకులు థ్రిల్ అవడం ఖాయమని అంటున్నారు అడివి శేష్. 

సినిమాలో రెజీనా మరియు నవీన్ చంద్రల నటన ఎంతో ఆకట్టుకుంటుందని, అలానే సినిమాకు  సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ మంచి ప్లస్ పాయింట్ అవుతుందని, రేపు విడుదల తరువాత తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను తమ సినిమా అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని మరియు కలెక్షన్ ని దక్కించుకుంటుందో వేచి చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: