టాలీవుడ్ పరిశ్రమలో ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన సమంత అనతికాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్య తో ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో అక్కినేని గారి ఇంట కోడలిగా అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత శర్వానంద్ తో కలిసి నటించిన జాను సినిమా విడుదల అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సమంత ప్రస్తుతం కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలలో, అలాగే అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతున్న ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.


ఇక ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే అశ్విన్ శరవణన్ అనే దర్శకుడి తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే ముందుగా మార్చి నెల నుండి మొదలవ్వాల్సిన సినిమా షూటింగ్ అనుకోని కారణాలవల్ల ఆగిపోయిందని ఇండస్ట్రీ టాక్. సమంత అక్కినేని తన తరువాత చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తో చేస్తున్నట్లు సమాచారం. పోయిన ఏడాది వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అందులో సమంత భర్త నాగ చైతన్య కూడా ఓ చిన్నపాటి రోల్ చేసిన సంగతి కూడా గుర్తు ఉండే ఉంటుంది. తీయబోయే సినిమాలో కూడా హీరో నాగచైతన్య గెస్ట్ అప్పియరెన్స్ కనిపించబోతున్నట్లు సమాచారం. దీంతో అక్కినేని అభిమానులు ఆ సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే సమంత నందినిరెడ్డి నిర్మించబోయే సినిమాని సోనీ పిక్చర్స్ నిర్మాణ బాధ్యతలు వహిస్తోంది. ఇకపోతే ఈ సినిమాను ఓ పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కథాంశం చూస్తే హర్రర్ థ్రిల్లర్ గా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట. అయితే ఈ సినిమాను మొదటగా శరవన్ అశ్విన్ దర్శకత్వం చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి అతను తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను నందినిరెడ్డి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలావరకు పూర్తయ్యాయి. ఈ సినిమా ను కన్నడ సినిమా దియా ను రీమేక్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: