అజ్ఞాతవాసి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ వరుస పెట్టి సినిమాలు అంగీకరిస్తున్నాడు. క్రిష్ - సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రెండు సినిమాలు చేసేందుకు ఓకే చెప్పాడు. ఇక మళయాళ రీమేక్ సినిమాలో రానాతో కలిసి నటిస్తున్నాడు. ఇక పవన్కు ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా క్రేజ్ తగ్గదు సరికదా ? రెమ్యునరేషన్ కూడా పెరుగుతూనే ఉంటోంది.
పవన్ వకీల్ సాబ్కు దిల్ రాజు దగ్గర రు. 50 నుంచి రు. 55 కోట్ల వరకు తీసుకుంటున్నాడట. ఇక క్రిష్ సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించే సినిమాలతో పాటు ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్తో కలిసి మల్టీస్టారర్ కు కూడా ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఇక అయ్యప్పన్ కోషియర్ రీమేక్, హరీష్ శంకర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఒక్కో సినిమాకు సగటున రు. 50 కోట్లు వేసుకుంటే పవన్ రీ ఎంట్రీ ఖరీదు ఏకంగా రు. 300 కోట్ల పై మాటే అని తెలుస్తోంది.
కేవలం రెమ్యునరేషన్ల రూపంలోనే రు. 300 - రు. 350 కోట్లు అతడికి ముట్టునున్నాయి. ఇక తమ అభిమాన హీరో ఒకేసారి ఆరు సినిమాలను లైన్లో పెట్టడంపై కూడా పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.