కొత్త బంగారులోకం సినిమా తో కుర్రకారు మతులు పోగొట్టిన శ్వేతాబసు ప్రసాద్ ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో పాటు ఓ హిందీ సినిమాతో బిజీ గా ఉన్నారు. నిజానికి శ్వేతా బసు ప్రసాద్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి పదేళ్ల వయసులోనే నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. హీరోయిన్ గా కూడా ఆమె తన అందం, అభినయం తో ఆకట్టుకున్నారు. అయితే అంతా బాగుందనుకుంటున్న సమయంలోనే ఆమె హైదరాబాద్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడట్టు సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనితో ఆమె టాలీవుడ్ చిత్ర పరిశ్రమను విడిచి బాలీవుడ్ కి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూసిన పాపాన పోలేదు. ఈ ఘటన తర్వాత ఆమె అవకాశాలు సన్నగిల్లాయి అని కూడా చెబుతుంటారు. ఏది ఏమైనా తాను ఏ తప్పు చేయలేదని శ్వేతా అంటుంటారు.

అయితే డిసెంబర్ 13, 2018 వ సంవత్సరంలో ఆమె రోహిత్ మిట్టల్ అనే ఓ ఫిలిం మేకర్ ని పెళ్లి చేసుకున్నారు. కానీ ఏడాది గడవకముందే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. డిసెంబర్ 15, 2019 లో ఇన్ స్టాగ్రామ్ వేదిక గా తాను రోహిత్ నుంచి విడాకులు తీసుకున్నానని శ్వేతా వెల్లడించారు. అయితే తాము విడాకులు తీసుకోవడానికి కారణం ఇద్దరి మనసులు కలవకపోవడమేనని ఆమె చెబుతున్నారు. ఒక పుస్తకం మంచిదో కాదో తెలుసుకోవాలంటే పూర్తిగా చదవాలి అని కానీ తాను రోహిత్ తో తన బంధాన్ని పూర్తిస్థాయిలో స్టడీ చేయలేదని.. తమ బంధం అసంపూర్తిగా మిగిలిపోయిన ఒక పుస్తకమని శ్వేతా బసు ప్రసాద్ చెప్పారు.

ఓ మనిషి మంచివాడో కాదో తెలియాలంటే వారి ఇష్టాలు, అయిష్టాలు, అభిప్రాయాలు పూర్తిగా తెలుసుకోవాలని... కానీ తాను రోహిత్ గురించి పూర్తిగా తెలుసుకోలేదని అందుకే భిన్నాభిప్రాయాలు వచ్చి తాము విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే తమ వైవాహిక జీవితం 8 నెలల్లోనే ముగిసినప్పటికీ.. తాను సంతోషంగానే ఉన్నానని ఆమె అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: