కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని తన అందం అలాగే నటనతో ఆకట్టుకున్న
హెబ్బా పటేల్ బయట జరిగే ఫంక్షన్స్ లో కూడా తన స్టైల్ తో అందరి కళ్ళని తన వైపు తిప్పుకుంటుంది.ప్రస్తుతం
హెబ్బా పటేల్ కొత్త కథలకు మాత్రమే ఓకే చెబుతోంది. మొదటి నుంచి కూడా
హెబ్బా పటేల్ ఎంచుకునే స్క్రిప్ట్లో కొత్తదనం ఉండేలానే చూసుకుంటుంది. తన పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాలను
హెబ్బా పటేల్ ఎంచుకుంటుంది.ఇక ఉమెన్స్ డే సందర్భంగా ఆమె కొత్తగా నటిస్తున్న తెలిసిన వాళ్ళు
సినిమా కాన్సెప్ట్ పోస్టర్ను పోస్ట్ చేస్తూ
హెబ్బా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. డిఫరెంట్ టైటిల్తో వస్తున్న ఈ
సినిమా సిరంజ్
సినిమా నిర్మిస్తోండగా.. విప్లవ్ కోనేటి దర్శకత్వంలో ఈ
మూవీ రాబోతోంది. ఈ
పోస్టర్ కూడా చాలా కొత్తగా ఉంది.
పోస్టర్ చూస్తుంటే ఈ
సినిమా దయ్యాలు కథల కనిపిస్తుంది. అందులో హెబ్బ కూడా ఒక దయ్యంగా కనిపించబోతుంది. ఇక
హెబ్బా పటేల్ ప్రస్తుతం ఓదెల రైల్వేస్టేషన్ అనే సినిమాలో నటిస్తోంది.ఈ చిత్రం నుండి
హెబ్బా పటేల్ లుక్ ఈ మధ్యనే విడుదల చేశారు. ఇందులో రాధ అనే పాత్రలో
హెబ్బా నటిస్తుంది.శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి
లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్లో 'బెంగాల్ టైగర్' చిత్రానికి దర్శకత్వం వహించిన సంపత్ నంది ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అశోక్తేజ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ మద్యనే
రెడ్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది హెబ్బ పటేల్. ఇలా వరసగా ఆమె విభిన్న కాన్సెప్ట్స్ ని ఎంచుకుంటు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందాం అని హెబ్బ ప్రయత్నం చేస్తుంది. చూడాలి ఆమె ప్రయత్నం ఎంతమేరకు ఫలిస్తుందో.