ఈ 2021 వ సంవత్సరంలో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. వాటిలో ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న  చిత్రాలలో మేజర్ చిత్రం కూడా ఒకటని చెప్పవచ్చు.టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోబితా ధూళిపాల వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గూఢచారి ఫేం శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకుడు. జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్ మరియు ఎ ప్లస్ మూవీస్ బ్యానర్ల తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇక ఈ సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల కాబోతుంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ టీజర్ ను సల్మాన్ ఖాన్, తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు, మలయాళం టీజర్ ను పృథ్వి రాజ్ సుకుమారన్ వంటి స్టార్ హీరోలు విడుదల చేయబోతున్నారు. 26/11 ముంబై అటాక్స్ లో ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్ణన్ చేసిన త్యాగం అంత ఈజీగా మర్చిపోయేది కాదు..ఆ సంఘటనతో పాటు మేజర్ జీవితం గురించి మనకి తెలియని విషయాలను కూడా ఈ చిత్రం ద్వారా తెలియజేయబోతున్నారు.ఇక ఇలాంటి ఆదర్శవంతమైన కథని ఎంచుకున్నందుకు అడివి శేష్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.


అలాగే ఇలాంటి టాలెంటెడ్ హీరోని ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను తీసుకున్నందుకు సూపర్ మహేష్ బాబుని కూడా ప్రశంసిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా అడివి శేష్ ని పెద్ద స్టార్ గా నిలబెట్టడం ఖాయమట. అలాగే ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్ గా ప్రతి భారతీయుడిని కదిలించడం ఖాయమట. ఖచ్చితంగా ఈ సినిమా దేశం గర్వించదగ్గ సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదట. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: