ఇక ఈ సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల కాబోతుంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ టీజర్ ను సల్మాన్ ఖాన్, తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు, మలయాళం టీజర్ ను పృథ్వి రాజ్ సుకుమారన్ వంటి స్టార్ హీరోలు విడుదల చేయబోతున్నారు. 26/11 ముంబై అటాక్స్ లో ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్ణన్ చేసిన త్యాగం అంత ఈజీగా మర్చిపోయేది కాదు..ఆ సంఘటనతో పాటు మేజర్ జీవితం గురించి మనకి తెలియని విషయాలను కూడా ఈ చిత్రం ద్వారా తెలియజేయబోతున్నారు.ఇక ఇలాంటి ఆదర్శవంతమైన కథని ఎంచుకున్నందుకు అడివి శేష్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
అలాగే ఇలాంటి టాలెంటెడ్ హీరోని ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను తీసుకున్నందుకు సూపర్ మహేష్ బాబుని కూడా ప్రశంసిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా అడివి శేష్ ని పెద్ద స్టార్ గా నిలబెట్టడం ఖాయమట. అలాగే ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్ గా ప్రతి భారతీయుడిని కదిలించడం ఖాయమట. ఖచ్చితంగా ఈ సినిమా దేశం గర్వించదగ్గ సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదట. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...