నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది నందమూరి నటసింహం వారసుడు mokshagna TEJA' target='_blank' title='నందమూరి మోక్షజ్ఞ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నందమూరి మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ గురించే. ఇప్పటికే దాదాపుగా మోక్షజ్ఞ వయసు ఉన్నవారంతా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా మారే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎప్పుడో లెజెండ్ సినిమా షూటింగ్ లో కనిపించిన తరువాత నుంచి మళ్ళీ మోక్షజ్ఞ పెద్దగా మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపధ్యంలోనే మోక్షజ్ఞ కు సినిమాలు చేసి ఆసక్తి లేదని ఆయన పై చదువుల నిమిత్తం విదేశాల్లోనే ఉంటున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ వస్తోంది..

 

తాజాగా ఈ విషయం మీద నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు నటసింహ నందమూరి బాలకృష్ణ సందర్భం పుట్టినరోజు సందర్భంగా ఆయన తన అభిమానులతో ముచ్చటించారు ఈ సందర్భంగానే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆయన ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ ఆదిత్య 999 సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలకృష్ణ చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వెలువడింది. నిజానికి నందమూరి బాలకృష్ణకు ఫేస్బుక్లో వెరిఫైడ్ పేజీ ఉంది కానీ ఆయన ట్విట్టర్లో ఇంకా అడుగు పెట్టలేదు. 

 

 

ఇక ఫ్యాన్స్ మాత్రమే ఒక అకౌంట్ ని ప్రస్తుతానికి నడుపుతున్నారు. ఇక మరో పక్క బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు ఆయన అభిమానులు. నిత్యవసర వస్తువుల పంపిణీ మొదలు కరోనా వ్యాక్సినేషన్ వరకు అనేక కార్యక్రమాలు చేసి తమ అభిమాన హీరో మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తం మీద బాలకృష్ణ ఈ కామెంట్స్ నిజంగా చేశారో లేదో తెలియదు కానీ నిజంగా ఆ కామెంట్ చేసి ఆయన ఎంట్రీ సినిమా ఆదిత్య 999 ఖాయం అని తేలితే ఇక ఫాన్స్ గాల్లో తేలి పోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: