టాలీవుడ్ లో వివాహ బంధాలు ఎలా ఉంటాయంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు లానే ఉంటాయి. ఏ చిన్న సమస్య వచ్చినా ఓపిక పట్టుకోలేక ఇద్దరు భాగస్వాములు గొడవపడి విడాకులకు సిద్ధమైపోతున్నారు. ఆవేశం లో చేసిన తప్పు  సరిదిద్దుకోలేక ఇలా చేయడం వల్ల సమాజానికి చెడు ప్రచారం వెళ్ళిపోతుంది. సామాన్యులు పక్కన పెడితే  సెలబ్రిటీలు సైతం ఈ విధంగా తమ జీవితాన్ని నాశనం చేసుకోవడం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చడం లేదు.

కథానాయిక సరిత గురించి అందరికీ తెలిసిందే. గుంటూరులో జన్మించిన ఈ తెలుగు అమ్మాయి బాలచందర్ తెరకెక్కించిన మరో చరిత్ర సినిమా ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో 150 సినిమాల వరకు చేసి ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీని అందుకుంది. సినిమా లైఫ్ చాలా ఆనందంగానే సాగిన ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. సరిత రెండుసార్లు పెళ్లి చేసుకుంది. 1975 రంగస్థల నటుడు వెంకటసుబ్బయ్య ని పెళ్లి చేసుకున్న సరిత కొన్ని కారణాల వల్ల పెళ్లయిన సంవత్సరానికి అతనితో విడాకులు తీసుకొని 1976 నుంచి మళ్లీ ఒంటరిగా జీవించ సాగింది.

ఆ తరువాత 1988లో మలయాళం నటుడు ముఖేష్  పెళ్లి చేసుకుంది ఈ హీరోయిన్. వాళ్లకు శ్రావణ్, తేజ్ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తయి. తర్వాత విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2007లో విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత ముఖేష్ క్లాసికల్ డాన్సర్ మైథిలీ దేవిక ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహం చెల్లదని సరిత కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా సరిత , ముఖేష్ లు ఇద్దరు 2015 మార్చి 4 న గురువారం కుటుంబ సంక్షేమ కోర్టుకు హాజరయ్యారు. అప్పుడు కోర్టుకు హాజరైన కవిత కోర్టులోనే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది. సరిత దుబాయ్ లో తన ఇద్దరు కొడుకుల తో ఉంటే ముఖేష్ మాత్రం తన కొత్త ఫ్యామిలీతో ఎర్నాకులం లో ఉంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: