విక్టరీ వెంకటేష్ సాధారణంగా కాంట్రవర్సీ లకు దూరంగా ఉంటాడు. కానీ ఆయన నటించిన కొండపల్లి రాజా సినిమా మాత్రం కాంట్రవర్సీ లకు గురి అవడంతో పాటు విమర్శల పాలు కూడా అయింది. కానీ అన్ని సమస్యలను దాటుకుంటూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచి, సూపర్ హిట్ విజయాన్ని వెంకటేష్ ఖాతా లో చేరవేసింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కొండపల్లి రాజా సినిమా అప్పట్లో కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇక ఊహించని విధంగా విడుదల తర్వాత ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిత్రం.
ఈ సినిమాలో సుమన్ మరో హీరోగా నటించాడు. అయితే తమిళ్ సినిమా అయినా "అన్నామలై " సినిమాకు రీమేక్ గా తెలుగులో చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే, ఈ సినిమా హిందీలో శత్రుఘ్నసిన్హా, జితేంద్ర లు కలిసి నటించిన "ఖుద్ గర్జ్" సినిమా నుంచి రీమేక్ చేయబడినది. కానీ ఈ సినిమాను శరత్ బాబు , కృష్ణంరాజు ఇద్దరూ కలిసి ప్రాణస్నేహితులు సినిమా గా తెరకెక్కించగా, తిరిగి తమిళ్ లో ఈ సినిమాలో శరత్ బాబు, రజనీకాంత్ కలిసి అన్నామలై చిత్రంగా రీమేక్ చేశారు. సినిమా తమిళ్ లో కూడా మంచి సూపర్ హిట్ ను అందుకుంది.
కానీ అప్పట్లో ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నప్పుడు, కృష్ణంరాజు ప్రాణ స్నేహితులు సినిమా తీశారు. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి హక్కులు మా నుంచి తీసుకోలేదని ఆయన కోర్ట్ కు ఎక్కారు. కానీ తిరిగి దర్శక నిర్మాతలు, హీరోలు రాజీ పడడంతో వివాదం చివరికి ముగిసిపోయింది. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ తో రవిరాజా పినిశెట్టి, వెంకటేష్ హీరోగా నగ్మా హీరోయిన్ గా ఈ సినిమాలో కొండపల్లి రాజా గా చిత్రీకరించారు . ఇక ఇన్ని విమర్శల పాలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడం మరో విశేషం.