టాలీవుడ్ సినిమా పరిశ్రమలో గ్లామర్ షో కి అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం నటించడానికి మాత్రమే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే నటీమణులలో ఒకరు నిత్యమీనన్. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇష్క్ గుండె జారి గల్లంతయ్యిందే లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఆ తరువాత నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను దక్కించుకుంది.

అయితే టాలీవుడ్ లాంటి కమర్షియల్ సినిమా పరిశ్రమలో రాణించాలంటే ఎంతో కొంత గ్లామర్ షో చేయాలి. అలా చేసిన వారు ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ లు గా ఎదిగారు. కానీ నిత్యమీనన్ ఈ ఒక్క కారణంగానే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగ లేదన్నది అందరికీ తెలిసిన సత్యం. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంగ్లీష్ సినిమా లో కనిపించి మెప్పించిన నిత్యా కన్నడ సినిమా లో లీడ్ పాత్ర చేసి సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమా తో ఎంట్రీ ఇచ్చి సౌత్ లో అన్ని భాషల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మాలిని 22 అనే సినిమాలో ఆమె నటించిన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. 

తెలుగులో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, జనతాగ్యారేజ్, గీతగోవిందం వంటి హిట్ సినిమాలలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న అయ్యప్పనుం కోషియుం రీమేక్ సినిమా లో పవన్ జోడీ గా చేస్తుంది. అలాగే సత్యదేవ్ హీరోగా నటిస్తున్న స్కైలాబ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. గ్లామర్ ను ఏమాత్రం ఎంకరేజ్ చేయాలని అవకాశాలు తగ్గుతున్న కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ సినిమా అవకాశాలను కొట్టేస్తోంది. మలయాళ, తమిళ భాషల్లో కలిపి ఆమె చేతిలో ఇప్పుడు అరడజను సినిమా ల దాకా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: