బాలీవుడ్ పరిశ్రమలో సూపర్ స్టార్ అయిన షారూఖ్ ఖాన్ కు అభిమానులలో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. అతని కొత్త, పాత చిత్రాలపై వారు తమ ప్రేమను చూపిస్తుంటారు. కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షాగా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను పాలించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు షారుఖ్ ఖాన్ ఎప్పటికీ అలాగే తెరపై చూడాలని కోరుకుంటారు. ప్రస్తుతం రీఎంట్రీకి సిద్ధమవుతున్న షారుఖ్ స్కూల్ డేస్ పిక్ ఒకటి నెట్టింట్లో సెన్సేషన్ గా మారింది. బాబీ అనే ట్విట్టర్ యూజర్ షారుఖ్ ఖాన్ చిన్నప్పటి చిత్రాన్ని పంచుకున్నాడు. ఇందులో షారుఖ్ ఖాన్ తన పాఠశాల స్నేహితులతో కలిసి కనిపిస్తాడు. ఈ  ఫొటోలో షారుఖ్ ఖాన్ స్నేహితులందరూ నవ్వుతూ కనిపిస్తారు. కాని ఆయన మాత్రం తీవ్రంగా ఎదో ఆలోచిస్తూ కనిపిస్తున్నాడు. ఈ పిక్ వైరల్ కావడంతో నెటిజన్లు భారీగా షేర్లు, లైకులు కురిపిస్తున్నారు.  

ఇటీవల షారుఖ్ ఖాన్, కాజోల్ మరోసారి రాజ్‌కుమార్ హిరానీ తదుపరి చిత్రంలో కలిసి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి రుమార్లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు షారూఖ్ ఖాన్ 'పఠాన్' చిత్రంతో చాలా కాలం తర్వాత వెండితెరపైకి తిరిగి వస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం, దీపికా పదుకొనే కూడా కనిపించనున్నారు. కత్రినా కైఫ్, అనుష్క శర్మలతో కలిసి షారుఖ్ ఖాన్ చివరిసారిగా "జీరో" చిత్రంలో 2018 సంవత్సరంలో వెండితెరపై కనిపించారు. ఈ సినిమాతో పాటు అంతకుముందు కూడా వరుస పరాజయాలను చవి చూసిన ఆయన కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యారు. మరోవైపు కరోనా కూడా తోడవ్వడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ సమయంలో పలువురు దర్శకులతో చర్చలు జరిపారు. అట్లీతో సినిమా అనే విషయం చాలాకాలంగా అటు బిటౌన్ లోనూ ఇటు కోలీవుడ్ లోనూ చక్కర్లు కొడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: