పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా తన సినిమా కెరీర్ లో పలువురు స్టార్ డైరెక్టర్స్ తో పాటు కొందరు యువ డైరెక్టర్స్ కి కూడా తన సినిమా ఛాన్స్ లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విధంగా కొత్త దర్శకులకి కూడా ఛాన్స్ ఇచ్చే మంచి మనసున్న పవన్ ప్రస్తుతం యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నారు. రానా కూడా మరొక మెయిన్ రోల్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే దీనితో పాటు మరోవైపు క్రిష్ తో హరిహర వీరమల్లు మూవీ కూడా చేస్తున్నారు పవన్.
ఇక ఈ రెండు సినిమాల తరువాత యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్, అలానే ఆపైన మరొక యువ దర్శకుడు సురేందర్ రెడ్డి తో మరొక సినిమా కూడా చేయనున్నారు. ఇక తన కెరీర్ ని వరుసగా ప్రస్తుతం ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న పవర్ స్టార్, వాటితో మంచి విజయాలు సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే హరీష్ శంకర్ సినిమా తరువాత ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి తో తొలిసారిగా పవర్ స్టార్ చేయనున్న సినిమా పై కూడా అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే పవర్ స్టార్ కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేసిన సురేందర్, ప్రస్తుతం దాని స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఎంతో భారీ స్థాయిలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా లో హీరోయిన్ గా ఇప్పటికే పలువురు స్టార్ నటీమణులను పరిశీలించిన దర్శకడు సురేందర్ రెడ్డి ఫైనల్ గా బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ ని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. గతంలో ప్రభాస్ తో సాహూ సినిమా చేసి మంచి క్రేజ్ అందుకున్న శ్రద్ధ, పవన్ సినిమా స్టోరీ నచ్చడంతో వెంటనే చేయడానికి ఓకె చేసారని సమాచారం .మరి ఇదే కనుక నిజం అయితే తొలిసారిగా పవర్ స్టార్ తో శ్రద్ధ జోడీని వెండితెరపై చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: