అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సుమంత్. చేసింది కొన్ని చిత్రాలే అయినా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన మార్క్ వేశాడు ఈ హీరో. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మరి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో గా తన కెరియర్ లో ఎక్కువగా క్లాస్ సినిమాలతో, వైవిద్యబరితమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు సుమంత్. తొలిప్రేమ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిన కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే చక్కగా సాగుతున్న వీరి కాపురంలో మనస్పర్ధలు తలెత్తడంతో వీరు విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్ళకి కీర్తి రెడ్డి ఒక ఎన్ఆర్ఐ ని వివాహం చేసుకుని సెటిల్ అవ్వగా...విడాకులు అయ్యి 16 ఏళ్లు గడుస్తున్నా సుమంత్ మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నారు.

అయితే ఈ మధ్య సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు దుమారం రేపాయి.  కానీ అవన్నీ సుమంత్ నూతన చిత్రం "మళ్ళీ మొదలైంది" అనే మూవీ వల్ల పుట్టుకొచ్చిన గాసిప్స్ అని రివీల్ అయింది. గతంలోనూ ఛార్మి, కమలినీ ముఖర్జీ ఈ ఇద్దరి హీరోయిన్లతో సుమంత్ ఎఫైర్ నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఛార్మితో గౌరి సినిమా తీస్తున్నప్పుడు సుమంత్ ఛార్మి ల మధ్య ఏదో ఉందని అంతా గుసగుసలాడారు, ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి. ఆ తరవాత మళ్లీ గపచిప్ అయిపోయాయి.  అలాగే కమలినీ ముఖర్జీతో గోదావరి సినిమా తీస్తున్నప్పుడు సుమంత్హీరోయిన్ ప్రేమలో పడ్డారని తెరలోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు రకరకాల వార్తలు వినిపించాయి.

కానీ కొన్నాళ్ళకి అవి కూడా అటకెక్కాయి.ఈ ఇరువురితో  సినిమాలు తీసిన తరువాత ఇలాంటి వార్తలు బయటకు రావడం సహజమే అని ఆయన ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు. కానీ సుమంత్ ఇప్పటికైనా ఓ ఇంటివాడు అయ్యి తనకంటూ ఒక కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నారు అభిమానులు. కానీ అప్పట్లో అవి నిజామాయినా బాగుండేదని ఫ్యాన్స్ అనుకున్నారు. మరి సుమంత్ ఈ ఏడాదైనా శుభవార్త చెబుతారేమో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: