సీన్ స్టార్ట్ అవ్వగానే.. అప్పుడే ఇంట్లోకి నందు, తులసి ఇద్దరు కూడా బెంగళూరు నుండి వస్తారు. ఈలోపే వాళ్ళు ఇంట్లోకి రాగానే నందు తల్లి అనసూయ ప్రేమగా వెళ్లి వాళ్ళని పలకరిస్తుంది. ఇక సీన్ లోకి ఎంటర్ అయిన లాస్య కోపంగా నందుతో..అసలు ఈ ఇంట్లో నేనేంటో? నా స్థానం ఏంటో ఇప్పుడే ఇక్కాడే తెలియాలి నందు అంటుంది. ఇక నందు లాస్య కి సమాధానమిస్తూ..ఇక్కడ జరిగిందంతా నాకు తెలుసు లాస్య..వీటి గురించి తరువాత మాట్లాడుకుందాం అంటారు. కానీ లాస్య అందుకు ఒప్పుకోదు.. ఇప్పుడే గా వాళ్ళు వచ్చింది వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్..మళ్లీ మాట్లాడుతువులే పో అంటాడు పరంధామయ్య. ఎవ్వరు ఏం చేప్పినా మాత్రం మొండిగానే ఉంటూ వాళ్ల మాట వినదు లాస్య . నువ్వు లేనప్పుడు ఇంట్లో నన్ను అందరూ ఈ ఇంటికి నీకు ఏమిటి సంబంధం అని అడిగారు… ఇంట్లో వాళ్ళు అలానే అంటున్నారు..బయట వాళ్లు అలానే అంటున్నారు.
నాకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటూ లాస్య గట్టి గట్టిగా అరుస్తుంది. అప్పుడు నందు నువ్వు ఎవరో ఇక్కడ అందరికి తెలుసుగా..మళ్లీ కొత్తగా చెప్పడం ఎందుకు అని అంటాడు నందు. అప్పుడు లాస్య ఇలాంటి కన్ఫ్యూషన్ మాటలు వద్దు ఓపెన్ గా చెప్పు అంటున్నప్పుడు సీన్ లోకి ఎంటర్ అయిన నందు చిన్న కొడుకు ప్రేమ్.. "మా నాన్నకి రెండో ఆలోచన కి టైం ఇవ్వవా..నువ్వు ఎందుకు లాస్య మా నాన్నను ఇలా ఇబ్బంది పెడుతున్నావు" అంటాడు. అప్పుడు లాస్య చూసావా చూసావా నీ ముందే నన్ను ఎలా మాట్లాడుతున్నారో నందు.. నువ్వు లేనప్పుడు ఇంకా చాలా చాలా మాటలు అన్నారు. కానీ నాకు ఇవన్నీ అనవసరం నువ్వు నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి నందు అంటూ ఏడుస్తుంది లాస్య. సీన్ కట్ చేస్తే మారిపోయిన అనసూయ లాస్య తో గొడవపడుతుంది..అలాగే తులసి నందు మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. కానీ తులసి ఒప్పుకోద్దు. దీంతో నందు లాస్యను పెళ్లి చేసుకోవడానికి రెడ్డీ అవుతాడు.. మరి చూడాలి వీళ్ళ పెళ్ళి ఈసారైనా జరుగుతుందో లేదో..?